మన్యం మనుగడ, పినపాక :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండల అభివృద్ధి కార్యాలయంలో పినపాక మండల ఎంపీపీ గుమ్మడి గాంధీ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వర్షాకాలం ప్రారంభం అయినందున ప్రజలకు సీజన్ లు వ్యాధుల పట్ల అవగాహన కల్పించాలని వైద్య శాఖ సిబ్బందికి, పంచాయతీ కార్యదర్శులకు తెలియజేశారు . ప్రతి గ్రామంలో వీధి లైట్లు ఏర్పాటు చేయాలని, తెలిపారు.ఎప్పటికప్పుడు ప్రజల ఆరోగ్య వివరాలను సేకరించాలని సూచించారు. ఈ సమావేశంలో ఎంపిడిఓ శ్రీనివాసులు,ఎంపిఓ శ్రీనివాసరావు, పినపాక వైద్యులు శివకుమార్, కార్యదర్శులు,వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: