దమ్మపేట జూన్ 06 ( మన్యం మనుగడ ) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దిశ కమిటీ (జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ) సభ్యునిగా దమ్మపేట మండలం మందలపల్లి గ్రామానికి చెందిన సామాజిక వేత్త ఫీడ్ ద నీడ్ సోషల్ వెల్ఫేర్ సొసైటీ చైర్మన్ గారపాటి సూర్యనారాయణ ఎంపికయ్యారు. ఈ మేరకు దిశ కమిటీ చైర్మన్ శ్రీ నామా నాగేశ్వరరావు మొహబూబాబాద్ ఎంపీ శ్రీమతి మాలోతు కవిత ల సిఫార్సు మేరకు జిల్లా కలెక్టర్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ సందర్భంగా గారపాటి సూర్యనారాయణ ఎంపీ నామాను కుటుంబ సమేతంగా కలిసి పుష్పగుచ్చం ఇచ్చి కృతజ్ఞతలు తెలియచేశారు.
కార్యక్రమం లో జిల్లా రైతుబంధు సమన్వయ కమిటీ కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, పర్వతనేని వరప్రసాద్, మందలపు సత్యనారాయణ,అడపా శ్రీనివాసరావు, అడపా సుబ్బారావు, గోపి, భద్రయ్య,భాగ్యరాజు, పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.కేంద్ర ప్రభుత్వ పథకాల అమలును ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది అని గారపాటి సూర్యనారాయణ తెలిపారు.
ఈ సందర్భంగా నామా వారికి మధ్యాహ్నం విందు ఏర్పాటు చేసి అభినందనలు తెలిపారు.
Post A Comment: