CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

గోదావరి ఇసుక లొ వే బిడ్జి దందాలు....

Share it:

 


 మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ : ఇసుకను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై విజయ లక్ష్మి అన్నారు. సోమవారం మణుగూరు నుండి చంద్రుగొండ కు నకిలీ పత్రాలతో ఇసుక తరలిస్తున్న లారీని ఎస్సై పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ఒకే బిల్లుపై రెండు వాహనాల్లో లేక రెండుసార్లు ఇసుకను తరలిస్తే, అట్టి వాహనాలను సీజ్ చేస్తామన్నారు. ఇసుకను అక్రమంగా ప్రభుత్వానికి రావాల్సిన రెవెన్యూ ను అక్రమార్కులు గండి కొట్టడం జరుగుతుందన్నారు. ఇటువంటి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. వాహనదారులు సైతం ఇసుక అక్రమ రవాణా కు సహకరించవద్దని అన్నారు. ఈ తనిఖీల్లో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: