మన్యం టీవీ దుమ్ముగూడెం ::
మండలంలోని పర్ణశాల గ్రామ పంచాయతీ పరిధిలోని పెద్దబండిరేవు గ్రామం మంగలి గూడెం గుంపు సి సి రోడ్డు నిర్మాణానికి 5లక్షల వ్యయంతో 115 మీటర్ల సిసి రోడ్డుకు పర్ణశాల సర్పంచ్ వరలక్ష్మి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామపంచాయతీ లోని ప్రతి పల్లెకు రహదారులు నిర్మించిన పంచాయతీ అభివృద్ధికి ముందుకు ఉంచేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఖాదర్ బాబు, ఎం పి టి సి భీమరాజు, పంచాయతీ కార్యదర్శి ప్రసాద్ రెడ్డి, వార్డు మెంబర్ లక్ష్మీ నర్శు, గ్రామ పెద్దలు చింత సర్వేశ్వరరావు, గ్రామస్తులు పాల్గొన్నారు..
Post A Comment: