గుండాల జూన్ 4(మన్యం మనుగడ) పల్లె ప్రగతి కార్యక్రమం సమర్థవంతంగా నిర్వహించాలని కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య అధికారులను ఆదేశించారు. శనివారం మండలంలో పర్యటించిన ఆయన పల్లె ప్రగతి కార్యక్రమం పై అధికారులకు ప్రజాప్రతినిధులకు తగు సూచనలు చేశారు. గుండాల స్మశాన వాటిక ను సందర్శించిన ఆయన గాలి దుమారానికి కొట్టకపోయినా స్మశానవాటిక రేకుల షెడ్డు ను పరిశీలించి ఈ నెలలో జరిగే జిల్లాపరిషత్ సమావేశంలో తీర్మానం చేసి జిల్లా కలెక్టర్కు నివేదిక పంపించి నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఆయన సాయనపల్లి పంచాయతీ లో పర్యటించారు పంచాయతీ పరిధిలోని ఘనపురం గ్రామంలో నూతనంగా ప్రారంభించిన క్రీడా మైదానాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు తక్కువ సమయంలోనే క్రీడా మైదానానికి స్థలాన్ని గుర్తించి క్రీడా సామాగ్రి ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆయన కితాబిచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి రామక్క, ఎంపీపీ ముక్తి సత్యం, ఎంపీడీవో హజరత్ వలి, తాసిల్దార్ కిషోర్, గుండాల సర్పంచ్ సీతారాములు, సాయనపల్లి సర్పంచ్ రామ్మూర్తి , ఏ పీ ఓ రవితేజ, టి ఏ లు కృష్ణ , నవీన్, గుండాల పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి నరేష్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: