మన్యం మనుగడ, మంగపేట.
తెలంగాణా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణా క్రీడా మైదానాల ఏర్పాటు గ్రామాలలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు ప్రారంభించటం జరిగింది.మంగపేట మండలం లోని రాజుపేట లో సైతం గ్రామీణ క్రీడా మైదానం ప్రారంభించిన అనంతరం ఉత్సాహవంతులైన యువతి యువకులకు వివిధ రకాల క్రీడలు నిర్వహించడం జరిగింది, అందులో గెలిచిన జట్లకు శనివారం నాడు గ్రామపెద్దల చేతుల మీదుగా ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ప్రధానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో యడ్లపల్లి నరసింహరావు,గంగెర్ల రాజారత్నం, తుమ్మల ముఖర్జీ, కర్రి శ్యాంబాబు, చదలవాడ సాంబాశివారావు, రాయసాబ్, విశ్వేవర్రావు, కుమారస్వామి, కర్రి శ్రీను, నిమ్మగడ్డ ప్రవీణ్, రాము తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: