మన్యం మనుగడ కరకగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని రైటర్ బస్తిలో నూతనంగా ఎర్పాటు చేసిన కార్యాలయం 24 వతేదీ ప్రారంభోత్సవం సందర్భంగా పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు ,మండల ప్రధాన కార్యదర్శులు,సొసైటీ డైరెక్టర్ లు పాల్గొని విజయవంతం చెయ్యాలని టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య గౌడ్ పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ మండల కేంద్రంలోని టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, సొసైటీ డైరెక్టర్ లు,ఎంపీపీ, ఎంపీటీసి లు,అనుబంధ సంఘాల నాయకులు,కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.నూతన కార్యాలయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు,పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు హాజరై ప్రారంభిస్తారు.అని తెలిపారు.
Navigation
Post A Comment: