మన్యం మనుగడ : జూలూరుపాడు, జూన్ 22, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు, టిఆర్ఎస్ పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు, ప్రభుత్వ విప్ నూతన కార్యాలయాన్ని 24వ తేదీన ఉదయం 10 గంటలకు ప్రారంభిస్తున్న సందర్భంగా ప్రభుత్వ విప్ రేగా కాంతారావు కార్యాలయం నుండి జూలూరుపాడు మండల టిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ప్రత్యేక ఆహ్వానం అందిందని మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చౌడం నర్సింహారావు తెలిపారు. ఈ కార్యక్రమానికి మండలంలోని పార్టీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, మండల కమిటీ సభ్యులు, గ్రామ కమిటీల సభ్యులు, రైతు సమన్వయ సమితి సభ్యులు, సొసైటీ డైరెక్టర్లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, తెలంగాణ ఉద్యమకారులు, కార్యకర్తలు అనుబంధ సంఘాల సభ్యులు, వార్డ్ నెంబర్లు, అందరూ కదిలి రావాలని కోరారు. ప్రభుత్వ విప్ రేగా కాంతారావు కార్యాలయ ప్రారంభోత్సవానికి మండలం నుండి పెద్ద ఎత్తున పార్టీ ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు కదిలి పోవడానికి సమాయత్తమవుతున్నట్లు తెలిపారు.
Navigation
Post A Comment: