మన్యం మనుగడ, మంగపేట.
మంగపేట మండలం తిమ్మంపేట గ్రామంలో ఇటీవలే వడదెబ్బతో మరణించిన దళిత కుటుంబానికి చెందిన దుర్గం మల్లయ్య కుటుంబానికి బిజెపి పార్టీ ఆధ్వర్యంలో 25 కేజీల బియ్యం ఆర్థిక సహాయం అందించడం జరిగింది. దుర్గం మల్లయ్య భార్య ఆదెమ్మ, కుమారుడు గోపితో మాట్లాడగా మాకు ఇంటి స్థలం ఇల్లు కూడా లేదని కన్నీటి ఆవేదన వ్యక్తం చేశారు.ఈ విషయంపై బిజెపి నాయకులు మాట్లాడుతూ తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి డబల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేసి ఆర్థిక సహాయం అందించాలనిప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ ములుగు జిల్లా దళిత మోర్చా ఉపాధ్యక్షులు జాడి రాంబాబు, ములుగు జిల్లా బీజేవైఎం కార్యదర్శి బంబోతుల మురళి, బిజెపి పార్టీ మండల ఉపాధ్యక్షులు అబ్బరబోయిన లక్ష్మణ్, దళిత మోర్చా మండల అధ్యక్షులు దుర్గం నరసింహారావు, కిసాన్ మోర్చా మండల కార్యవర్గ సభ్యులు లొడిగ మధుకర్, బూత్ కమిటీ అధ్యక్షులు దంతనపెళ్లి సత్యనారాయణ, బిజెపి పార్టీ సీనియర్ నాయకులు దుర్గం నరసింహులు ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: