మన్యం మనుగడ, మంగపేట.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా మంగపేట మండలం లోని తిమ్మంపేట గ్రామం లో జడ్పీఎచ్ఎస్ పాఠశాల లో ఎచ్ డి ఎఫ్ సి బ్యాంకు పరివర్తన్ కార్యక్రమం లో భాగంగా వృత్తి స్వచ్ఛంద సంస్థ వారు, ములుగు జిల్లా అటవీ శాఖ సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమం లో ముఖ్య అతిధి గా పాటిల్ ప్రశాంత్ బాజీరావు ఐఎఫ్ఎస్ ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ డబ్ల్యూ ఎల్ ఎం ఏటూరునాగారం,మంగపేట రేంజ్ అధికారి ఎండీ .షకీల్ పాష, రేంజ్ అధికారి బాలరాజు, డిప్యూటీ ఆర్వో అరుణ తిమ్మంపేట, అటవీశాఖ సిబ్బంది, వృత్తి స్వచ్చంద సంస్థ ప్రాజెక్ట్ మేనేజర్ కిషోర్ కుమార్ ఇళ్ల, వారి బృందం గ్రామ కోఆర్డినేటర్ గుండు శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం సందర్బంగా ఎచ్ డి ఎఫ్ సి బ్యాంకు వారు ఏర్పాటు చేసిన డిజిటల్ క్లాస్ రూం ప్రారంభించారు, పిల్లలకు స్పోర్ట్స్ కిట్స్ అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తిమ్మంపేట స్కూల్ హెడ్ మాస్టర్ రవికుమార్ మేనేజ్మెంట్ చైర్మన్ చెన్నపల్లి రాంబాబు, గ్రామ పెద్ద పూజారి సురేందర్, పంచాయతీ సెక్రటరీ దేవిప్రియ, ఉపాద్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం లో పిల్లలతో కలిసి ర్యాలీ నిర్వహించి తిమ్మంపేట బస్టాండ్ సమీపంలో మానవ హారంతో పాటు ప్రతిజ్ఞ చేయటం జరిగింది. స్కూల్ ఆవరణలో మొక్కలు నాటడం, కిచెన్ గార్డెన్ ప్రారంభించారు. పిల్లలకు పర్యావరనం మీద వ్యాస రచన, డ్రాయింగ్ పోటీలు నిర్వహించి బహుమతులు అందచేయడం జరిగింది.
Post A Comment: