CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

లారీ ని ఢీ కొట్టిన స్కార్పియో వాహనం.ప్రమాదంలో ఇద్దరు మృతి.

Share it:



  • ఒకరికి తీవ్ర గాయాలు.

మన్యం మనుగడ ఏటూరు నాగారం

ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం లోని 163 జాతీయ రహదారి అయ్యప్ప స్వామి ఆలయ సమీపంలో ఆదివారం ఉదయం జరిగిన ప్రమాదంలో స్కార్పియో వాహనం లారీని ఢీ కొనడంతో స్కార్పియో నడుపుతున్న ములుగు మండలం జాకారం గ్రామానికి చెందిన వల్లాల కృష్ణయ్య(46), వరంగల్ కు చెందిన శివ (17) అనే బాలుడు అక్కడికక్కడే మృతి చెందారు. శివ మామ రాజు కు తీవ్రగాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. శివ రాజు మామ అల్లుళ్ళు కాగా వీరిద్దరూ వరంగల్ రత్న హోటల్ లో పని చేస్తారని,వీరు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో తునికి ఆకుల క ల్లలపై వంటపని కోసం వెళ్లి వస్తున్న క్రమంలో శనివారం ఉదయం ఏటూరు నాగారం జంపన్న వాగు బ్రిడ్జి దాటిన తర్వాత,వరంగల్ నుండి ఏటూరు నాగారం మండలం ముళ్ళ కట్ట రాంపూర్ గ్రామానికి ఇసుక కోసం వస్తున్న లారీని ఢీ కొనడంతో కృష్ణయ్య, శివ అక్కడికక్కడే మృతి చెందారు. రాజు కు తీవ్ర గాయాలు కాగా చికిత్సకోసం ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న స్థానిక సిఐ కిరణ్ కుమార్,ఎస్ ఐ రమేష్ సంఘటన స్థలానికి చేరుకొని, స్కార్పియో వాహనంలో ఇరుక్కు పోయిన మృతదేహాలను స్థానికుల సాయంతో బయటకు తీసి,పోస్టుమార్టం నిమిత్తం స్థానిక సామాజిక ఆస్పత్రికి తరలించారు.

Share it:

TS

Post A Comment: