గుండాల జూన్ 13(మన్యం మనుగడ) దళిత బంధు దేశానికే ఆదర్శం అని ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. సోమవారం మండలంలో పర్యటించిన ఆయన దళిత బంధు ద్వారా లబ్ధిదారులకు తీసుకున్న వాహనాలను వారికి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దళిత బంధు పథకం దేశానికి ఆదర్శం అన్నారు. దళిత బంధు పథకం తీసుకువచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బాంధవుడు అయ్యాడని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని అన్నారు. ఆఖరి లబ్ధిదారుడు వరకు దళిత బంధు పథకం చేరుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జలగం ట్రస్ట్ చైర్మన్ మాజీ మంత్రివర్యులు ప్రసాదరావు, జెడ్ పి టి సి రామక్క, ఎంపీపీ సత్యం, తాసిల్దార్ కిషోర్, ఎంపీడీవో హజరత్ వలి, టిఆర్ఎస్ నాయకులు రాంబాబు, పార్టీ మండల అధ్యక్షులు భాస్కర్, సర్పంచ్ నరసింహారావు, నాయకులు వీరస్వామి, అబ్దుల్ నబీ, నిట్ట రాములు, యువజన విభాగం నాయకులు అజ్జు, శ్రీను, లక్ష్మీనారాయణ, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: