CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు అందజేత.

Share it:

 


మన్యం మనుగడ, పినపాక:

 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం లోని పలు ప్రాంతాలకు చెందిన వ్యక్తులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పినపాక మండల ఎంపిపి గుమ్మడి గాంధీ, మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. మల్లారం గ్రామానికి చెందిన సిహెచ్ శ్రీను కు 28,000, మద్దుల గూడెం గ్రామానికి చెందిన ఎలకం గణేష్ కు    16000, జానం పేట గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు కు 60,000, చెగర్శల గ్రామానికి చెందిన నజీరుద్దీన్ కు 28,000, దుగినేపళ్లి గ్రామానికి చెందిన మంగమ్మ కు 42,500, దుగినే పల్లి గ్రామానికి చెందిన సక్రు కు 16500  ల విలువ గల సహాయనిధి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ గుమ్మడి గాంధీ, మండల అధ్యక్షుడు సతీష్ రెడ్డి లు మాట్లాడుతూ, ఆపదలో ఉన్నవారికి ఆపన్న హస్తం అందిస్తూ, టిఆర్ఎస్ పార్టీ ముందడుగు లో ఉందని,పార్టీతో ప్రమేయం లేకుండా ఎవరికి ఎటువంటి ఆపద సంభవించిన ముఖ్యమంత్రి సహాయనిధి నుండి చెక్కుల రూపంలో సహకారం అందిస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమాలలో పిఎసిఎస్ చైర్మన్ రవి వర్మ, ఆత్మ కమిటీ చైర్మన్ భద్రయ్య, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు దాట్ల వాసు బాబు,జనం పేట ఎంపిటిసి హరీష్, ఆదివాసి ఐక్యవేదిక అధ్యక్షులు తోలెం శ్రీనివాస్, టిఆర్ఎస్  నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: