మన్యం మనుగడ : జూలూరుపాడు, జూన్ 8 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల పరిధిలోని పడమట నర్సాపురం గ్రామపంచాయతీ పరిధిలోని దండుమిట్ట తండా శివారు నాయక్ ఆగ్రో కోళ్ల ఫామ్ బుధవారం సుమారు 5 గంటల సమయంలో అగ్ని ప్రమాదంలో పూర్తిగా దగ్ధమైంది. కోళ్ల ఫామ్ పక్కనే ఉన్న కౌలు రైతు తన పొలంలోని చెత్తను తగుల పెడుతుండగా ఉదృతంగా గాలి రావడంతో సమీపంలో ఉన్న కోళ్ల ఫామ్ కి నిప్పు అంటుకుని మంటలు చెలరేగాయి. వెంటనే యజమాని స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో స్థానిక ఎస్సై తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని ఫైర్ స్టేషన్ కు కాల్ చేసి మంటలను అదుపులోకి తెచ్చారు. ఫామ్ లో ఉన్న సుమారు 20 పొదుగుడు కోళ్లు, కోళ్ళ దాణా కు సంబంధించిన మెటీరియల్, వ్యవసాయ పరికరాలు, విలువైన కలప కాలి బూడిద అయ్యాయని, వీటి విలువ సుమారు 2 లక్షల రూపాయల వరకు ఉంటుందని నాయక్ ఆగ్రో కోళ్ల ఫామ్ యజమాని గుగులోతు రాంబాబు తెలిపారు.
Navigation
Post A Comment: