CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పల్లెలలో చదువు పై అవగాహన కల్పిస్తున్న పి డి ఎస్ యు బృందం.

Share it:


గుండాల/ఆళ్లపల్లి జూన్ 8(మన్యం మనుగడ) పల్లెలలో చదువుపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న పి డి డి ఎస్ యు బృందం. పి డి ఎస్ యు ఓయూ యూనివర్సిటీ పిలుపుమేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్టడీ టూర్ నిర్వహిస్తున్నారు. అనంతరం పి డి ఎస్ యు జిల్లా కార్యదర్శి పృద్వి మాట్లాడుతూ ఏజెన్సీలో ఆలోచనాత్మకంగా స్టడీ టూర్ జరుగుతుందని అన్నారు. కోట్ల రూపాయల సంపద ఉన్న దొంగలించ బడుతుంది కానీ విద్యార్థి చదివిన చదువును ఎవరు దొంగలించ లేరన్నారు. చదువు కోవడం ద్వారా సమాజంలో మంచి గుర్తింపుని సాధించవచ్చని దానితోపాటు తన జీవితాన్ని ఉన్నత శిఖరాలకు ఎదిగే విధంగా చదువు దోహదపడుతుందన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి గ్రాడ్యుయేట్ అయ్యేవిధంగా చదవాలని ఆయన కోరారు. స్టడీ టూర్ లో భాగంగా ఆళ్ల పల్లి మండలంలోని పలు గ్రామాల్లో విద్యార్థులకు అవగాహన ప్రచారం నిర్వహించామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా పంధా నాయకులు ఇసం శంకర్, వెంకటేశ్వర్లు, సమ్మయ్య, పి.డి.ఎస్.యు నాయకులు శ్వేత, మీనా, మేనక, వంశి వర్ధన్, రంగవల్లి, పార్థసారథి తదితరులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: