దమ్మపేట జూన్ 13 ( మన్యం మనుగడ ) : అఖిల భారత విద్యార్థి సమైఖ్య, అఖిల భారత యువజన సమాఖ్య ఆధ్వర్యంలో వివిధ సమస్యలపై దమ్మపేట ఉప తహసిల్దారు కి మెమోరాండం ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ .ఏఐవైఎఫ్ మండల కార్యదర్శిలు సుంకు పాక ధర్మ,బత్తుల సాయి. మాట్లాడుతూ దమ్మపేట మండలంలో జూనియర్ కాలేజీ మంజూరైనా కానీ ఇప్పటివరకు కాలేజీ పనులు మొదలు పెట్టలేదని క్లాసులు ప్రారంభించలేదని తక్షణం క్లాసులు ప్రారంభించాలని కాలేజీ నిర్మాణం చేపట్టాలని కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందించాలని స్కూల్ పిల్లలకు ఆహార ఛార్జీలు పెంచాలని అంగనవాడి సెంటర్లో పిల్లలకు బాలింతలకు గర్భిణీలకు నాణ్యమైన ఆహారం అందించాలని చదువుకున్న యువతి యువకులకు ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని నిరుద్యోగ యువతీ యువకులకు నిరుద్యోగ భృతి 5000 ఇవ్వాలని స్వయం ఉపాధి కల్పించాలని ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేసినారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి పండూరి వీరబాబు ఏఐటీయూసీ కార్యదర్శి బెజవాడ రాము మహిళా కార్యదర్శి జానీ బేగం తుపాకుల శాంతి దళిత యువత నాయకుడు నాగరాజు వెంకట్ డోక్క గోపి పండూరి కిరణ్ విద్యార్థులు నిరుద్యోగ యువతీ యువకులు పాల్గొన్నారు.
Post A Comment: