గుండాల జూన్ 30(మన్యం మనుగడ) మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాల విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో సత్తా చాటారు ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు 30 మంది తెలుగు మీడియం విద్యార్థులు 18 మొత్తం48 మంది పరీక్ష రాయగా మొత్తం36 విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.పాఠశాల 75 శాతం ఉత్తీర్ణత సాధించింది ఇంగ్లీష్ మీడియం నుండి జాటోత్ కళ్యాణి 9.2,గడ్డం వైష్ణవి 8.2 గ్రేట్ సాధించింది. తెలుగు మీడియం నుండి కుంజ దీపిక 9.0,ఈసం త్రిష 8.7 గ్రేట్ సాధించి ముందు నిలిచారు.అనంతరం ప్రధానోపాధ్యాయులు కిషన్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో అనుభవిజ్ఞులైన ఉపాధ్యాయులతో విద్యను బోధించడం,జరుగుతుందన్నారు.విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదివే విధంగా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూచించారు.
Navigation
Post A Comment: