గుండాల జూన్ 30(మన్యం మనుగడ) చలో ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని న్యూ డెమోక్రసీ నాయకులు అవునూరి మధు పిలుపునిచ్చారు. జులై 4వ తేదీన ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమం పార్టీ చేపట్టిందని నాయకులు కార్యకర్తలు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ భృతి, 57 సంవత్సరాలకు ఆసరా పెన్షన్, ఉద్యోగ అవకాశాలను కల్పించాలని కోరుతూ ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమం చేపట్టామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం అన్ని హామీలను అమలు చేయాలని ఆయన కోరారు. ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్ పి టి సి రామక్క, ఎంపీపీ ముక్తి సత్యం, సర్పంచ్ సీతారాములు, పి వై ఎల్ జిల్లా కార్యదర్శి రవి, అరెం నరేష్ , వై వెంకన్న, బానోతు లాలు, లాలయ్య, బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: