CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

విద్యార్థులు ప్రభుత్వ డిగ్రీ కళాశాల మణుగూరులో చేరండి:ప్రిన్సిపాల్ డాక్టర్ బి శ్రీనివాస్..

Share it:


మన్యం టీవీ మణుగూరు:


ఇంటర్మీడియట్ పూర్తయిన విద్యార్థులు డిగ్రీలో చేరడం కోసం డిగ్రీ ఆన్లైన్ అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభమైందని వెంటనే విద్యార్థులు తమ పేరును మీ సేవ సెంటర్ నందు రిజిస్టర్ చేసుకొని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మణుగూరు నందు సంప్రదించాలని ప్రభుత్వ డిగ్రీ కాలేజి ప్రిన్సిపాల్ డాక్టర్ బి శ్రీనివాస్ ఒక పత్రికా ప్రకటనలో కోరారు.గిరిజన ప్రాంతంలో అత్యాధునిక సౌకర్యాలు కలిగిస్తూ,విశాలమైన ఆటస్థలం కలిగిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు నిష్ణాతులైన అధ్యాపకులచే తరగతులు నిర్వహించబడుతుందని,డిగ్రీ తర్వాత విద్యార్థులు కోరుకునే విధంగా ప్లేస్మెంట్లు పొందడానికి, ఉన్నత విద్యను అభ్యసించడానికి ప్రత్యేక శిక్షణ కళాశాలలో ఏర్పాటు చేయడం జరుగుతుందని కావున విద్యార్థులు ప్రభుత్వ డిగ్రీ కళాశాల మణుగూరు ఎన్నుకొని తమ ఉజ్వల భవిష్యత్తును ఏర్పరచుకోవాలని కోరారు. విద్యార్థులు అడ్మిషన్ కొరకు కళాశాలలో సంప్రదిస్తే కళాశాలలోని హెల్ప్ లైన్ సెంటర్ ద్వారా సహాయం చేపడుతుందని తెలిపారు. విద్యార్థులు ఆధార్ కార్డు మొబైల్ లింక్ ఏర్పాటు చేసుకోవాలని తర్వాత రిజిస్ట్రేషన్ సమయంలో ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్ కు ఓటిపి వస్తుంది కావున దానిని ఎవరికి షేర్ చేయకుండా ఆ ఫోన్ అడ్మిషన్ ప్రక్రియ పూర్తయ్యే వరకు అందుబాటులో ఉంచుకోవాలని కోరారు. విద్యార్థులు తమ వద్ద ఉన్న సర్టిఫికెట్ తో వెంటనే కళాశాలలోని హెల్ప్లైన్ సెంటర్ ను సంప్రదించి అడ్మిషన్ పొందాలని కోరారు.

Share it:

TS

Post A Comment: