దమ్మపేట జూన్ 30 ( మన్యం మనుగడ ) : భారత విప్లవోద్యమ నేత,అదర్శ కమ్యూనిస్టు శ్రామిక వర్గ యోధుడు, కార్మీక వర్గ నాయకుడు, సీపీఐ ఎంఎల్ ప్రజాపంథా రాష్టృ కార్యదర్శి కామ్రేడ్ వెంకట కృష్ణన్నకు విప్లవ జోహార్లు అర్పించిన
సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా పాల్వంచ డివిజన్ కార్యదర్శి అమర్లపూడి రాము.
కామ్రేడ్ డి వి వెంకటకృష్ణ జూన్ 26న అనారోగ్యంతో చనిపోవడం జరిగింది, పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు గండుగులపల్లి,దురదపాడు,మొండివర్రే,లింగాలపల్లి, గొర్రెగుట్ట
గ్రామాలలో సిపిఎంఎల్ ప్రజాపందా గ్రామ కమిటీల ఆధ్వర్యంలో కామ్రేడ్ డీవీ కృష్ణ గారికి నివాళులర్పిస్తూ సంతాప సభలు నిర్వహించడం జరిగింది ఈ సభలో సీపీఐ ఎంఎల్ ప్రజాపంథా పాల్వంచ డివిజన్ కార్యదర్శి అమర్లపుడి రాము పాల్గొని ప్రసంగిస్తూ వెంకట కృష్ణ గారు చనిపోవడం అనేది భారత విప్లవోద్యమానికి, పార్టీ కార్మిక వర్గానికి తీరని లోటు అన్నారు. తన జీవితమంతా కార్మికవర్గం అభివృద్ధి కోసం పోరాడిన యోధుడు అని తను నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాంతం కృషి చేశారనీ అన్నారు తన రాజకీయాలను ముందు తీసుకఫొవలిసిన బాధ్యత తమ మీద ఉందని వారన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ మండల,గ్రామ నాయకులు వాడె గిరి,చాపా ముత్యలరావు ,సున్నం కృష్ణారావు,వాడె జయ(సర్పచ్ )సోయం రాములమ్మ,తాటి నారాయణ బండి ఆదినారాయణ,కీసరి వెంకటేష్ మడివి శ్రీను,కుంటా శ్రీను ప్రభుదాసు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: