CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

విద్యార్థులను సన్మానించిన ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామూర్తి.

Share it:


మన్యం మనుగడ, అశ్వారావుపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, అశ్వారావుపేటలోని వికెడివిఎస్ రాజు జూనియర్ & డిగ్రీ కాలేజి నందు 2021-2022 సంవత్సరాలలో ఇంటర్ ఫలితాల్లో మొదటి, ద్వితీయ సంవత్సరంలో స్టేట్ 3వ ర్యాంకులు మరియు కాలేజ్ టాపర్లగా నిలిచి అశ్వారావుపేట మండలానికి మరియు కళాశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తెచినందుకు విద్యార్థులను శాలువాతో సత్కరించి మెమెంటో లు, బహుమతులను అందజేసిన అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు జల్లిపల్లి శ్రీరామమూర్తి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు తమ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని శ్రద్ధగా చదవాలని, తల్లిదండ్రులు తమ పిల్లలపై ఎంతో ఆశతో కష్టపడి పనిచేసి చదివిస్తున్నారు అని కనుక ప్రతి ఒక్కరూ మీ తల్లిదండ్రులు మిపై పెట్టుకున్న ఆశలను నెరవేర్చే విధంగ చదివి ప్రతి ఒక్క విద్యార్ధి ఉన్నత స్థాయికి ఎదిగాలని అయన తెలిపారు. చదువును ఇష్టపడి చదివితే మీరు అనుకున్నది సాధిస్తారనీ అయన తెలిపారు. ఈ సందర్భంగ విద్యార్థులను క్రమశిక్షణలో విద్యలో ముందు రనించటానికి కష్టపడే ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే విడుదలైన పదవ తరగతి ఫలితాలలో పాసైన విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అచ్యుతాపురం సర్పంచ్ నాగలక్ష్మి, అశ్వారావుపేట తెరాస పార్టి టౌన్ ప్రెసిడెంట్ సంపూర్ణ, సెక్రెటరీ ఫణీంద్ర కళాశాల ప్రిన్సిపాల్ శేషుబాబు, కళాశాల అధ్యాపక భృంధం తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: