మన్యం మనుగడ, అశ్వారావుపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని రైటర్ బస్తీ ప్రభుత్వ విప్ కార్యాలయం నందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావును బుధవారం నాడు అశ్వరావుపేట మండల రామన్నగూడెం గ్రామానికి చెందిన పోడు భూముల సాగుదారులు రేగా కాంతారావుని మర్యాదపూర్వకంగా కలిసి వారు పడుతున్న ఇబ్బందులు వారికి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫారెస్టు రెవెన్యూ, అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు, ఆ భూములకు సంబంధించి సర్వే నిర్వహిస్తారని వారికి తెలియజేయడం జరిగింది. సీఎం కేసీఆర్ తోనే పోడుముల పరిష్కారం దొరుకుతుందనీ, సమస్య శాశ్వత పరిష్కారం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారనీ, త్వరలో అర్హులైన లబ్ధిదారులకు హక్కులు కల్పించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ విషియంలో అధైర్య పడవద్దని చెప్పారు అడవి భూమిపై ఆధారపడి ఉపాధి పొందుతున్న గిరిజనులకు పట్టాలు పంపిణీ చేసేందుకు సర్వం సిద్ధం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అశ్వరావుపేట నియోజవర్గ నాయకులు జారే ఆదినారాయణ, రామన్నగూడెం సర్పంచ్ మడకం స్వరూప, అశ్వారావుపేట మండల తహసీల్దార్ చల్లా ప్రసాద్, రామన్నగూడెం గ్రామ ప్రజలు మడకం నాగేశ్వరావు మరియు పలువురు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: