CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఆయుర్వేద వైద్య శిబిరాన్ని ప్రారంబించిన ఎంపీపీ రేగా కాళిక.ప్రజలకు మెరుగైన వైద్య సేవ లక్ష్యం డాక్టర్ సిహెచ్ కుమార్ స్వామి.

Share it:


మన్యం మనుగడ కరకగూడెం : పురాతన ఆయుర్వేద వైద్యంతో దీర్ఘకాలిక వ్యాధులు సైతం నయం చేయవచ్చని ఆయుర్వేద మందులతో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని ప్రభుత్వ ఆయుర్వేద వైద్యాధికారి డాక్టర్‌ సిహెచ్ కుమారస్వామి,డాక్టర్‌ వై మంజుల పేర్కొన్నారు. స్థానిక ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల కరకగూడెం వారి ఆధ్వర్యంలో చిరుమళ్ళ వట్టవారిగుంపు గ్రామపంచాయతి పరిధిలోని చిరుమళ్ళ గ్రామపంచాయతీ ఆవరణలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం,అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ శిబిరాన్ని కరకగూడెం ఎంపీపీ రేగా కాళిగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించినారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిట్టి చిట్కాలు పాటిస్తే రోగాలు దరిచేరవని, నిద్రలేమితో ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయని సూచించారు.అనంతరం ఈ వైద్య శిబిరంలో సుమారు 450 మంది రోగులను పరీక్షించి మందులు పంపిణీ చేసినారు. ఈ కార్యక్రమంలో ఎమ్ఎన్ఓ శ్రీనివాసరావు, ఎస్ఎన్ఓ సమ్మయ్య స్థానిక సర్పంచ్ లు పాయం నరసింహరావు, అరెం.సాంబ సెక్రటరీ వెంకటెష్ ఎఎన్ఎమ్,ఆశా కార్యకర్తలు మరియు వైద్యశాల సిబ్బంది పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: