- జూన్ 15, 16 లో పర్యటన
- అన్ని విభాగాల్లో క్షుణ్ణంగా పరిశీలన
మణుగూరు: ప్రభుత్వ డిగ్రీ కళాశాల మణుగూరును నేషనల్ కౌన్సిల్ ఫర్ అక్రియేషన్ అండ్ అప్లియేషన్ కౌన్సిల్ (నాక్) బృందం డాక్టర్ కైలాస్ సుదాని, డాక్టర్ సునిందర్ తంగ్, తుషార్ మనోహర్ దేశాయ్ జూన్ 15, 16 తేదీలలో సందర్శించడం జరిగింది. కళాశాలలోని వివిధ డిపార్ట్మెంట్ లను పరిశీలించడం జరిగింది. గురువారం సాయంత్రం 5 గంటలకు వీడుకోలు సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది. వీడ్కోలు సమావేశం లో నాక్ బృందం చైర్మన్ డాక్టర్ కైలాస్ సుదాని మాట్లాడుతూ మారుమూల గిరిజన ప్రాంతంలో ఏర్పాటు చేయబడిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల మణుగూరు నందు గిరిజన విద్యార్థులకు అన్ని అనుకూలమైన వసతులను ఏర్పాటు చేయటం గర్వకారణంగా ఉందని అన్నారు. అధ్యాపకుల పనితీరు పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. కళాశాలల నిర్వహణ పట్ల,విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. బృందం కోఆర్డినేటర్ శ్రీమతి డాక్టర్ సునిందర్ తంగ్ మాట్లాడుతూ విద్యార్థునులకు ప్రత్యేకంగా అందించే వసతుల పట్ల అభినందనలు తెలియజేశారు.
Post A Comment: