గుండాల జూన్ 30(మన్యం మనుగడ) తాసిల్దార్ ఆఫీస్ లో పనిచేస్తున్న వీఆర్ఏలకు పదోన్నతుల తోపాటు స్కేల్ ను అమలు పరచాలని తాసిల్దార్ కు వినతిపత్రం ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ 2020 సెప్టెంబర్ లో వీఆర్ఏలకు పదోన్నతులు వారసత్వ ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించారని ఇప్పటికి దాన్ని అమలు పరచడం లేదన్నారు. వీఆర్ఏ జేఏసీ పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి తాసిల్దార్ కు వినతి పత్రాన్ని ఇస్తున్నామని వీఆర్ఏలు పేర్కొన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో శివాజీ, సారయ్య, జె సారయ్య, నరసమ్మ, స్వరూప తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: