మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ: పదో తరగతిలో మండల వ్యాప్తంగా 82 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారాని మండల విద్యాశాఖధికారి సత్యనారాయణ తెలిపారు.గురువారం రాష్ట్ర వ్యాప్తంగా విడుదల అయిన పదో తరగతి పరీక్ష ఫలితాలలో మండల ఉత్తీర్ణత వివరాలు ఆయన వెల్లడించారు. ముత్తుకూరు హై స్కూల్లో 83 శాతం, చండ్రుగొండ హైస్కూల్ నందు 79 శాతం,రేపల్లెవాడహైస్కూల్ నందు 75 శాతం, పోకలగూడెం హైస్కూల్ నందు 74 శాతం, చంద్రుగొండ కేజీబీవీ లో 89 శాతం, చండ్రుగొండ సెయింట్ జోసెఫ్ పాఠశాల నందు 100 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా మండల వ్యాప్తంగా అత్యుత్తమ ఫలితాలు సాధించినందుకుగాను మండల విద్యాశాఖధికారి సత్యనారాయణ, ఎంపీపీ భానోత్ పార్వతి, జెడ్పిటిసి కొనకొండ్ల వెంకటరెడ్డి,తాహసిల్దార్ వర్షా రవికుమార్, ఎంపీడీవో అన్నపూర్ణ లు అభినందనలు తెలిపారు.
Post A Comment: