- అధ్యక్ష కార్యదర్శులు గా భూక్య శంకర్, భూక్య కేవల్య ఎన్నిక..
మన్యం మనుగడ : జూలూరుపాడు, జూన్ 21, సిపిఐ 12 వ మండల మహాసభలో గిరిజన సమైక్య నూతన కమిటీని జిల్లా కార్యదర్శి భూక్యా శ్రీనివాస్ ఎంపిక చేశారు. తెలంగాణ గిరిజన సమైక్య జూలూరుపాడు మండల అధ్యక్షులుగా పాపకొల్లు గ్రామానికి చెందిన భూక్య కేవల్య నాయక్, కార్యదర్శి గా గంగారం తండా గ్రామానికి చెందిన భూక్య శంకర్ ను ఎన్నుకొన్నారు. ఉపాధ్యక్షులుగా హరియ, బోడ వెంకన్న, సహాయ కార్యదర్శి గా గుగులోతు కిర్య, కల్తీ కృష్ణయ్య, భానోత్ రాములు, ఎంపికయ్యారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ.. గిరిజన సంఘం అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించి సంఘాన్ని అభివృద్ధి చేస్తామని మాపై నమ్మకం ఉంచి ఎన్నుకున్న జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
Post A Comment: