గుండాల జూన్ 21(మన్యం మనుగడ) వరంగల్ లో జరిగే బి ఎస్ పి పార్టీ సమావేశాన్ని జయప్రదం చేయాలని పినపాక నియోజకవర్గ అధ్యక్షులు ఇర్ప రవి పిలుపునిచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈనెల 26వ తారీఖున వరంగల్ నగరంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ బహిరంగ సభకు రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హాజరై ప్రసంగించారు ఉన్నట్లు ఆయన అన్నారు. ఈ బహిరంగ సభకు మండల ప్రజలు, విద్యార్థులు, మేధావులు తరలిరావాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కల్తీ మల్లయ్య, జిల్లా నాయకులు బొమ్మెర రాంబాబు, వీరస్వామి, బాలకృష్ణ , వేణు, కొప్పుల చరణ్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: