బీహెచ్ఈఎల్ పరిధిలో పనిచేస్తున్న ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ ను జెన్కోలో సెక్యూరిటీ గార్డ్స్ గా తీసుకోవాలని ఐ.ఎఫ్.టి.యు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్. మధుసూదన్ రెడ్డి బి టి పి ఎస్ యాజమాన్యాన్ని కోరారు. మంగళవారం ఈ విషయమై బి టి పి ఎస్ సి ఈ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ btps నిర్మాణం ప్రారంభమైనప్పటి నుండి గత 7 సంవత్సరాలుగా బి హెచ్ ఈ ఎల్ పరిధిలో 33 మంది ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ గా విధులు నిర్వహిస్తున్నారని, త్వరలో బీహెచ్ఈఎల్ కంపెనీ ఇక్కడ నుండి వెళ్లి పోతున్న కారణంగా వీరంతా ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని . వీరి కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉందని అన్నారు. వీరంతా నిర్వాసిత గ్రామాల, స్థానిక మండల పరిధిలోని వారే అన్నారు. కావున btps యాజమాన్యం ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని వీరందరికీ btps లో సెక్యూరిటీ గార్డ్స్ కి అవకాశం కల్పించాలని btps యాజమాన్యాన్ని కోరారు.
ఈ కార్యక్రమం లో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ బిల్లా. సందీప్, బుడగం.ఆదినారాయణ, ముత్యం. సంతోష్, కొండేరు. రమేష్, సానికొమ్ము .సంజీవరెడ్డి, గుండగాని.భాస్కర్, వీరముష్టి.ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: