గుండాల జూన్ 18(మన్యం మనుగడ) పల్లె ప్రగతి కార్యక్రమం తో పల్లెలు పరిశుభ్రంగా మారాయి. 15 రోజులుగా పల్లె ప్రగతి కార్యక్రమం మండలంలోని 11 పంచాయతీలో సాగింది. మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించి గ్రామ పంచాయతీ సిబ్బంది ని ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో గ్రామాల అన్నిటిని పరిశుభ్రంగా మా మార్చారు పల్లె ప్రగతి కార్యక్రమం ముగిసిన కూడా నిర్విరామంగా పరిశుభ్రంగా ఉండే పల్లెల కోసం పని చేస్తామని సర్పంచులు పేర్కొన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంతో ఎంతో మేలు జరుగుతుందని సర్పంచులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ కిషోర్, సర్పంచ్ సీతారాములు, ఎంపీటీసీ సంధాని, ఉప సర్పంచ్ ఉపేందర్, లైన్మెన్ నరేష్ , సిసి బక్కయ్య, సెక్రటరీ శ్రీనివాస్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు
Post A Comment: