గుండాల జూన్ 18(మన్యం మనుగడ) ఏ ఐ కె ఎం ఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆశిష్ మిట్టల్ పై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పెట్టిన తప్పుడు కేసులు అన్నిటిని తక్షణమే ఉపసంహరించుకోవాలని న్యూ డెమోక్రసీ నాయకులు డిమాండ్ చేశారు. అనంతరం ఏ ఐ కే ఎన్ ఎస్ నాయకులు గుండాల ఎంపీపీ సత్యం మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం రైతుల కోసం ఉద్యమాలు చేసే నాయకుల పై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తోందని అన్నారు కేంద్ర ప్రభుత్వంతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా రైతు నాయకులు ఉద్యమ నాయకుల పై తప్పుడు కేసులు పెడుతున్నారు. కేసులకు భయపడేది లేదని రైతుల కోసం నిరంతరం ఉద్యమాలు చేస్తూనే ఉంటామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సీతారాములు, ఉప సర్పంచ్ ఉపేందర్ ,మాజీ ఎంపీపీ ఈసం కృష్ణ , మాజీ ఎంపీటీసీ పెంటన్న, నాయకులు వై వెంకన్న, సారయ్యలు పాల్గొన్నారు
Post A Comment: