గుండాల జూన్ 3(మన్యం మనుగడ) మండలంలో జాతీయ జెండాకు తీవ్ర అవమానం జరిగింది. అవతరణ దినోత్సవం పురస్కరించుకొని పాఠశాలలో జెండా ఎగరవేసిన ఉపాధ్యాయుడు అవనతం చేయకుండానే వదిలేశాడు. మండలం పరిధిలోని నాగారం గ్రామం లోని ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడు జెండా ఎగురవేసి రోజు గడుస్తున్న జాతీయ జెండాను అవనతం చేయకుండా అవమానించారు. గతంలో సైతం ఇదే పాఠశాలలో జెండా ఎగురవేయకుండా అవమాన పరుచగా... ఈసారి జెండా ఎగురవేసి అవనతం అవమానించాడు. నాగారం పాఠశాలలో జాతీయ జెండాకు అవమానం జరుగుతూనే ఉంది. ఇప్పటికైనా జిల్లా ఉన్నత అధికారులు ఉపాధ్యాయుల పై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు వేడుకున్నారు
Post A Comment: