మన్యం టీవీ దుమ్ముగూడెం ::
దుమ్ముగూడెం మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో జయశంకర్ బడిబాట కార్యక్రమం ప్రారంభించారు. గంగోలు గ్రామంలో ప్రాథమిక పాఠశాల స్కూల్ నందు బడిబాట కార్యక్రమం సర్పంచ్ చంద్రశేఖర్, ఎంపీటీసీ రత్నాకర్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఎట్టకేలకు రెండేళ్ళ తర్వాత పూర్తి స్థాయిలో ఈనెల 13 పాఠశాల పున ప్రారంభం అవుతున్నాయి. సర్కారు బడుల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపెట్టి విద్యార్థుల సంఖ్యను పెంచడంపై దృష్టి సారించింది ఇందులో భాగంగానే నేటి నుండి పదవ తారీకు వరకు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం శ్రీకారం చుట్టింది ప్రైవేట్ స్కూల్ దీటుగా ప్రభుత్వ స్కూల్లో కూడా విద్యార్థులను చేర్పించాలని ఈ సందర్భం తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కవిత, ఉపాధ్యాయుల వెంకట్, గ్రామస్తులు పాల్గొన్నారు
Post A Comment: