మన్యం టీవీ దుమ్ముగూడెం జూన్ 03 ::
దుమ్ముగూడెం మండలం గౌరారం పంచాయతీ పరిధిలో గ్రామంలో లో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి 5 విడత ఈ కార్యక్రమం ఈ రోజు ప్రారంభించారు. ముందుగా గౌరారం గ్రామంలో గ్రామస్తులు అందరితో కలిసి పాదయాత్రగా వెళ్లి సమస్యలు తెలుసుకున్నారు. సర్పంచ్ జ్యోతి అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించి సమస్యలు పరిష్కారం ఏ విధంగా చేయాలని తీర్మానం చేయడం జరిగింది. పల్లె ప్రగతి కార్యక్రమం 15 రోజులపాటు ప్రతిరోజు ఏదో ఒక సమస్య మీద ప్రోగ్రాం నిర్వహించి, ఆ సమస్య పరిష్కారం దిశగా తీర్మానం చేయడం జరుగుతుందని తెలిపారు. 5 విడత పల్లె ప్రగతి ఈ కార్యక్రమంలో పారిశుద్ధ్య నిర్వహణ, మొక్కలు నాటే స్థలాల గుర్తింపు, క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు ప్రధాన అంశాలుగా తీసుకుని వాటిని గ్రామ సభలో తీర్మానం చేసి పరిష్కారం దిశగా చర్యలు చేపడతామని తెలియజేశారు. ఈ కార్యక్రమం లో స్థానిక సర్పంచ్ సోడి జ్యోతి, ఎం పి పి రేస్ లక్ష్మి, టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కనితి రాముడు, ఎంపీడీవో చంద్రమౌళి, ఎంపీవో ముత్యాలరావు, మండల స్పెషల్ ఆఫీసర్ చంద్రప్రకాష్, పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ సునందరావు, పంచాయతీ సెక్రెటరీ శ్రావణి, గ్రామస్తులు పాల్గొన్నారు..
Post A Comment: