CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలలో ఫీజు రాయితీ కల్పించండి.... డీఈవో సోమేశ్వర శర్మకు మండల ప్రెస్ క్లబ్ కమిటీ వినతి..

Share it:

 


మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ: చండ్రుగొండ మండలంలో వివిధ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ కల్పించాలని మండల ప్రెస్ క్లబ్ కమిటీ శనివారం మండలానికి విచ్చేసిన జిల్లా విద్యాశాఖ అధికారి సోమేశ్వర శర్మ,ఎంఈఓ సత్యనారాయణకు వినతిని సమర్పించారు. అక్రిడేషన్ కలిగిన జర్నలిస్టులకు, అక్రిడేషన్ లేని జర్నలిస్టుల పిల్లలకు సైతం ఫీజు రాయితీలో భాగస్వామ్యం కల్పించాలని కోరారు. స్పందించిన జిల్లా విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ... అక్రిడేషన్, నాన్ అక్రిడేషన్ జర్నలిస్టుల పిల్లలందరికీ ప్రైవేట్ పాఠశాలలో ఫీజు రాయితీ వచ్చేలా జిల్లా కలెక్టర్ తో మాట్లాడతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రామిశెట్టి సైదయ్య, ప్రధాన కార్యదర్శి వెలగల మధు, ఉపాధ్యక్షులు ఎస్కే జాఫర్, సభ్యులు మునగాల కోటా చారి,కుంజా వెంకటేష్,పాషా, కృష్ణ ప్రసాద్, పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: