దమ్మపేట జూన్ 16 ( మన్యం మనుగడ ) : హైదరాబాదు లోని విద్యా నగర్ బీసీ భవన్ లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీసీ సంక్షేమ సంఘం కమిటీ లు సంఘం అభివృద్ధి ఉద్యమ తీరుతెన్నులు గురించి కూలంకుషంగా అడిగి తెలుసుకున్నారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉద్యమాన్ని గ్రామ గ్రామాన తీసుకెళ్లాలని గ్రామ మండల నియోజకవర్గ జిల్లా కమిటీలు పూర్తిస్థాయిలో వేసి జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాజకీయ పార్టీగా అభివృద్ధి అందేలా కృషి చేయాలని ఆర్ కృష్ణయ్య సూచించారు ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రెడ్డిమల్ల వెంకటేశ్వరరావు తో పాటు జాతీయ బీసీ సంక్షేమ సంఘం సీనియర్ నాయకులు జిల్లా ఉపాధ్యక్షులు పితాని సత్యనారాయణ పాల్గొన్నారు.
Post A Comment: