మన్యం టీవీ దుమ్ముగూడెం ::
మన ఊరు మన బడి కార్యక్రమం లో భాగంగా 14 లక్షల సీతారాంపురం ఎం పి యు పి ఎస్ పాఠశాల భవనాలకు మరమ్మతులు ప్రారంభించారు. పాఠశాలలో భవనాల పై కప్పు మరమ్మతులు ఫ్లోరింగ్ పనులు చేపట్టడానికి ఎంపీపీ రేస్ లక్ష్మి, జె.పి టి సి సీతమ్మ, స్థానిక సర్పంచ్ పూజారి కృష్ణవేణి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పల్లె ప్రగతి మన ఊరు మన బడి కార్యక్రమంలో ప్రతి సమస్యను వెలికితీసి అభివృద్ధి చేస్తుందని పిల్లలు అందరు ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, టిఆర్ఎస్ పార్టీ మండల కార్యదర్శి రాముడు, ప్రగళ్ళపల్లి ఎం పి టి సి మడకం రామారావు, టిఆర్ఎస్ నాయకులు సుబ్బారావు, గంగరాజు తదితరులు పాల్గొన్నారు
Post A Comment: