మన్యం మనుగడ, అశ్వారావుపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, అశ్వారావుపేట, గుమ్మడి వల్లి, కేశప్పగుడెం గ్రామాలలో పల్లె ప్రగతి కార్యక్రమం లో భాగంగా ఏర్పాటుచేసిన పాదయాత్ర మరియు గ్రామసభ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, అశ్వరావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు, అశ్వరావుపేట ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రతి పల్లె మంచి అభివృద్ధితో ముందుకు వెళ్ళాలనే ఆలోచనతో ఈ పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమలను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారని, ఈ పల్లె ప్రగతి కార్యక్రమం లో ప్రతి గ్రామంలో కూడా పాద యాత్ర చేసుకుంటూ ఏ సమస్యలు ఉన్నాయి అనేది తెలుసుకొని వెంటనే వాటినీ పరిష్కరించాలని అయన కోరారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటు జెడ్పీటీసీ చిన్నం శెట్టి వరలక్ష్మి, సర్పంచ్ లు, ఎంపిటిసి లు, ఎంపీడిఓ, ఎంఆర్ఓ, ఆర్డిఓ, సెక్రెటరీలు, గ్రామ ప్రజలు పార్టి కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: