మన్యం మనుగడ కరకగూడెం: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలను అందంగా తీర్చిదిద్దాలని లక్ష్యంతో తో ప్రవేశపెడుతున్న ఐదో విడత పల్లె ప్రగతి కార్యక్రమం ఎంపీపీ రేగా కాళిక ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాలను అందంగా తీర్చిదిద్దాలి అనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం, పల్లె ప్రగతి ,నిర్వహిస్తుందని ,గ్రామాలలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని గ్రామాల రూపురేఖలు మార్చాలని ఆమె అన్నారు. పల్లె ప్రగతి మొదటిరోజు భాగంగా గ్రామాల్లో పాదయాత్ర చేసి గ్రామసభ నిర్వహించారు. నాలుగో విడత లో జరిగిన పల్లె ప్రగతి కార్యక్రమాలపై పై సభలో వివరించారు రు ప్రగతి నివేదిక గ్రామసభ ముందు ఉంచారు. నాలుగో విడత లో పూర్తి కాని పనులు ఐదో విడత లో పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగాలని ఆమె అన్నారు. గ్రామాలలో పారిశుద్ధ్యం చెత్త సేకరణ ఇంకుడు గుంతలు మురుగు నీరు నిల్వ డ్రైనేజీ కాలువలు శుభ్రం వంటి పనులు నిరంతరం జరగాలని ఏమన్నారు ఈ కార్యక్రమంలో కరకగూడెం సర్పంచ్ ఊకె రామనాథం,ఎంపీటీసీ శైలజ, కార్యదర్శి ప్రశాంత్, ఎంపీడీవో, డి. శ్రీనివాస్,ఎంపీఓ. చిరంజీవి, ఏ పీఓ ,శ్రీను,స్పెషల్ ఆఫీసర్లు కార్యదర్శులు ,అన్ని పంచాయతీల్లో సర్పంచులు వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: