- ప్రత్యేక పూజల్లో పాల్గొన్న,ఎమ్మెల్యే మెచ్చా ,అంజి జారే,శాలువతో సత్కరించిన ఆలయ కమిటీ
ములకలపల్లి:(జూన్ 19)మన్యం మనుగడ ప్రతినిధి :
మండలం లోని పూసుగుడెం(గ్రామం), లో శ్రీశ్రీశ్రీ సీతారామ లక్ష్మణ హనుమత్ సమేత, జీవద్వజ ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమంలో స్థానిక నాయకులతో కలిసిఅనంతరం ఎమ్మెల్యే మెచ్చా, మాజీ శాసన సభ్యులు తాటి వెంకటేశ్వర్లు, జారే ఆదినారాయణ, నరాటి ప్రసాద్,పలువురు ఆలయాన్ని దర్శించి ప్రత్యేక పూజ కార్యకర్మంలో పాల్గొన్నారు, అనంతరం10,000/- రూపాయాలను మాజీ జడ్పీటీసీ బత్తుల అంజి ఆలయ కమిటీకి అందచేసారు.అనంతరం ఎమ్మెల్యే
మెచ్చా మాట్లాడుతూ గ్రామస్థులంతా కలిసి రామాలయం నిర్మించుకోవటం ఆనందం గా ఉందని,ఆలయ నిర్మాణానికి సహకరించిన ధాతలను అభినందించారు. గ్రామస్థులంతా సుఖ సంతోషాలతో ఉండాలని స్వామి వారిని కోరుకున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో వారి వెంట తెరాస మండల పార్టీ అధ్యక్షుడు మోరంపుడి అప్పారావు గారు ,రైసస మండల అధ్యక్షుడు నాగళ్ళ. వెంకటేశ్వరరావు గారు, ఎంపీపీ మట్ల.నాగమణి గారు,సీనియర్ నాయకులు శనగపాటి. శీతారాములు గారు,గాదె తిరుపతి రెడ్డి గారు,సురభి.రాజేష్,టీఆర్ ఎస్వి మండల అధ్యక్షుడు గుంట్రు. కృష్ణా యాదవ్ తెరాస యూత్ అధ్యక్షుడు తాటి.ప్రవీణ్, ఆలయ కమిటీ సభ్యులు మాజీ సర్పంచ్ భూక్యా పత్తి లాల్ గారు,ప్రసాద్ గారు, బద్రూ గారు,శివ,గాదిగోని వెంకటేష్ గౌడ్
నాయకులు, కార్యకర్తలు,గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: