మన్యం మనుగడ, పినపాక:
మండలంలోని సీతంపేట గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో బడిబాట కార్యక్రమాన్ని ఎంపిపి గుమ్మడి గాంధీ శనివారం ప్రారంభించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం మౌళిక సదుపాయలను ఏర్పాటు చేస్తుందని అన్నారు . ప్రైవేటు పాఠశాలల దీటుగా,ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమంలో బోధన ప్రారంభించ పడుతున్నదని అన్నారు. ఎదురింటి విద్యార్థి ఆంగ్ల మాధ్యమ కల సాకారం కాబోతుందని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం లో సర్పంచ్ పోతినేని శివ శంకర్,సోసైటి డైరెక్టర్ కోండేరు రాము,ఎంపిడిఓ శ్రీనువాసులు,ఎంపిఓ బత్తిని శ్రీనివాసరావు,తెరాస సీనియర్ నాయకులు కోలేటి భవాని శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: