CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీపీ.

Share it:

 


మన్యం మనుగడ, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, ఊట్లపల్లి, వేదంతపురం గ్రామ పంచాయతీలలో 5 వ రోజు పల్లె ప్రగతి కార్యక్రమం లో భాగంగ ఈ రోజు అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు జల్లిపల్లి. శ్రీరామమూర్తి పాల్గొని పల్లె ప్రగతి పనులను పరిశీలించి మొక్కలు నాటారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రతి పల్లె ప్రగతి పథంలో ముందుకు వెళ్ళాలనే ఆలోచనతో ఎంతో ఖర్చుతో చాలా ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారని, దీని వలన ప్రతి గ్రామం చాలా శుభ్రతతో పచ్చని మనిహరంలా ప్రతి గ్రామం మారుతుందని అయన తెలిపారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి అక్కడి వసతులను పిల్లలకు పెట్టే పౌష్ఠిక ఆహారం ను పరిశీలించిన అశ్వారావుపేట ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి. అలాగే ఉట్లపల్లి గ్రామ పంచాయతీ లోని మన ఊరు మన బడి కార్యక్రమంలో సెలెక్ట్ ఐనా పాఠశాలకు సుమారు 5.20 వేల రూపాయల నిధులను కేటాయించడంతో అక్కడి పనులను ప్రారంభించటానికి శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించిన అశ్వారావుపేట ఎంపీపీ జలపల్లి శ్రీరామమూర్తి. ఈ కార్యక్రమంలో ఆయన తో పాటు సర్పంచ్ లు జ్యోత్స్న భాయ్, సోమిని శివ ప్రసాద్, ఎంపిటిసి రామకృష్ణ, తెరాస పార్టి మండల అధ్యక్షులు బండి పుల్లారావు, ఎంపీడీఓ విద్యాధర రావు, ఎంపీఓ సీత రామరాజు, సెక్రటరీ లు శ్యామ్, యాకూబ్ ఆలి తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: