- మండలంలో జూనియర్ కళాశాల మంజూరు
- కళాశాల అభివృద్ధికి నూతన కమిటీ
- ఎన్నికప్రభుత్వ విప్ పినపాక శాసన సభ్యులు రేగా కాంతారావు
కరకగూడెం మండలాన్ని రానున్న రోజుల్లో మోడల్ మండలంగా తీర్చిదిద్దుతానని ప్రభుత్వ విప్,పినపాక శాసన సభ్యులు తెరాస జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు అన్నారు.
మంగళవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు మాట్లాడారు.
మండల కేంద్రంలో నివసిస్తున్న గిరిజన,బడుగు బలహీన వర్గాల,వెనుకబడిన తరగతుల చెందిన విద్యార్థుల కోసం ప్రభుత్వ జూనియరు కళాశాలను రేగా మంజూరు చేశారు.
ఈ సందర్భంగా కళాశాల అభివృద్ధి కోసం చిట్టి వెంకటేశ్వర్లు,అక్కిరెడ్డి వెంకట్ రెడ్డి,బైరిశెట్టి సూర్య నారాయణ,యాలిపెద్ది శ్రీనువాస రెడ్డి,పోగు వెంకటేశ్వర్లు ను నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది.అనంతరం మండలంలో నూతన కళాశాల మంజూరు చేసినందుకు ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ని ఘనంగా సత్కరించారు.
Post A Comment: