మన్యం మనుగడ ఏటూరు నాగారం
ఏటూరు నాగారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు చిట మట రఘు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మహిళా జిల్లా నాయకురాలు కట్కూరి రాధిక మాట్లాడుతూ. హైదరాబాద్ నడిబొడ్డులో గత నెల 28 వ తారీఖున ఒక మైనర్ బాలికను ఐదుగురు ప్రజాప్రతినిధులకు చెందినవారు గ్యాంగ్ రేప్ చేయడం పోలీసుల పనితీరు అద్దం పడుతుందని అన్నారు. పోలీసులు అలసత్వం కనబడుతుంది అని కూడా అన్నారు.అమినేసియా పబ్ లో స్నేహంగా ఉండి డ్రాప్ చేసి సిటీలో కార్లో బాలికను అత్యాచారం చేశారని ఇప్పటికి వారం అయినా కూడా పోలీసులు వారిని అరెస్టు చేయకపోవడం తెరాస పార్టీ కి పోలీసులు కొమ్ముకాస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు అని అన్నారు.వారిలో వక్ఫ్ బోర్డు చైర్మన్ మనవడు,బహుదూర్ పూర ఎమ్మెల్యే కొడుకు ఉన్నారని పోలీసులు విచారణ ను అలసత్వం చేస్తున్నారని అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో తెరాస ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఎండి ఖలీల్ ఖాన్,గుడ్ల దేవేందర్, జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి ఎండి గౌస్, ఏటూరు నాగారం ఉప సర్పంచ్ కర్ల అరుణ, జిల్లా మైనార్టీ కార్యదర్శి ఎండి సులేమాన్,ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు కర్నె సత్యం, కట్కూరి హరిబాబు సర్వ అక్షిత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: