గుండాల/ ఆళ్లపల్లి జూన్ 2(మన్యం మనుగడ) ఆళ్ల పల్లి మండలంలో ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ రజియా సుల్తానా జెండా ఎగురవేసి అవతరణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ మంజు భార్గవి జెండాను ఎగరవేశారు. మండలంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో పాఠశాలలో జాతీయ జెండాను ఎగురవేసి రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మంగమ్మ అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు
Post A Comment: