గుండాల/ఆళ్లపల్లి జూన్ 2(మన్యం మనుగడ) ఆళ్ల పల్లి మండలం పరిధిలోని లక్ష్మీపురం గ్రామంలో క్రీడా మైదానాన్ని ఎంపీపీ మంజు భార్గవి ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామంలో క్రీడా మైదానం ఏర్పాటు చేయాలని సూచించడంతో ఆల పల్లి పంచాయతీ పరిధిలో నీ లక్ష్మీపురం గ్రామంలో అధికారులు క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని అధికారులు ప్రజా ప్రతినిధులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జెడ్ పి టి సి హనుమంతరావు, ఎంపీడీవో మంగమ్మ, వైస్ ఎంపీపీ ఎల్లయ్య, సర్పంచ్ కోటేశ్వరరావు, ఉప సర్పంచ్ వినోద, అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు
Post A Comment: