జూనియర్ కళాశాల సెంటర్లోని శ్రీ సాయినాధుని మందిరంలో గురువారం నాడు బాబా వారికి ఉదయం అభిషేకం అర్చన జరిపారు. స్వర్ణ కిరీటం ధరింప చేసి హారతి పాడారు.
అతి త్వరలో శ్రీ సాయి బాబా వారికి చేయించనున్న స్వర్ణ రుద్రాక్షమాల కు నీలి దేవ ప్రసాద్ శ్రీ మాధవి దంపతులు 11 వేల రూపాయల విరాళం ను ఆలయ ఉపాధ్యక్షులు కొమ్మనాపల్లి ఆదినారాయణ కు అందజేశారు. విరాళం అందించిన దాతను శాలువాతో సత్కరించారు.
మధ్యాహ్నం పారెల్లి సంతోష్ కుమార్ మానస దంపతులు,పోరిక రామ్ కుమార్, వాణి కుమారి దంపతులు మరియు భక్తుల ద్వారా వచ్చిన విరాళాలతో 500 మంది బాబా వారి అన్నప్రసాదం స్వీకరించారని, అదేవిధంగా ప్రతి గురువారం వృద్ధాశ్రమం లోని వంద మంది వృద్ధులకు భోజనం అందిస్తున్నామని అధ్యక్షులు తుమ్మలపల్లి సత్యనారాయణ మూర్తి తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Post A Comment: