గుండాల జూన్ 2(మన్యం మనుగడ) తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి గ్రామంలో క్రీడా మైదానం ఉండాలన్న నేపథ్యంలో మండలం పరిధిలోని సాయన పల్లి పంచాయతీ పంచాయతీ పరిధిలోని గణపురం గ్రామంలో మైదానాన్ని రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని అధికారులు ప్రారంభించారు. ఈ ప్రారంభ కార్యక్రమాన్ని ఎంపీపీ ముక్తి సత్యం, ఎంపీడీవో హజ్రత్ అలీ, తాసిల్దార్ కిషోర్ లు ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం సూచించిన విధంగా గ్రామాల్లో క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేశామని వారు అన్నారు. క్రీడలతో మానసిక ఉల్లాసంతో పాటు ఉద్యోగ అవకాశాలు సాధించవచ్చు కనుక క్రీడ మైదాన ఉంటే యువకులు క్రీడలు ఆడుకునేందుకు కేసులు వెసులుబాటు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్ పి టి సి రామక్క, అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు
Post A Comment: