CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ప్రొఫెసర్ జయశంకర్ "బడిబాట"లో జిల్లా విద్యాశాఖ అధికారి..

Share it:

 



మన్యం మనుగడ : జూలూరుపాడు, జూన్ 3 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ప్రొఫెసర్ జయశంకర్ "బడిబాట" కార్యక్రమం మొదటిరోజు లో భాగంగా మండల పరిధిలోని ఎంపీపీ ఎస్ మాచినేని పేట తండా గ్రామపంచాయతీలో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో శుక్రవారం జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర శర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామంలో బడి ఈడు గల విద్యార్థులను గుర్తించి పాఠశాలలో నమోదు చేయుటకు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని అన్నారు. అదే విధంగా ఈ విద్యాసంవత్సరం నుంచి అన్ని పాఠశాలలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. కావున ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను కూడా ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలో ఎక్కువ నమోదు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులను కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ జి వెంకట్ గ్రామ సర్పంచ్ లకావత్ భారతి, ఎంపీటీసీ బానోత్ నీల, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, ఎస్ఎంసి చైర్మన్, గ్రామ పెద్దలు లకావత్ గిరిబాబు, భానోత్ చిన్న, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: