మన్యం మనుగడ : జూలూరుపాడు, జూన్ 3 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల పరిధిలోని మాచినేనిపేట తండా గ్రామ పంచాయితీ లో 5వ విడత "పల్లె ప్రగతి" కార్యక్రమం శుక్రవారం మండల స్పెషల్ ఆఫీసర్ భీమ్లా నాయక్, ఎంపీడీవో ఏలూరి శ్రీనివాసరావు ప్రారంభించారు. మొదటిరోజు గ్రామసభ నిర్వహించి, అనంతరం గ్రామంలో పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమం 03-06-2022 నుండి
18-06-2023 వరకు కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భారతి, ఎంపీటీసీ బానోతు నీల, ఎంపీఓ రామారావు, పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ గోపికృష్ణ,
పంచాయితీ కార్యదర్శి కె సంజీవరెడ్డి, మాజీ సర్పంచ్ లకావత్ గిరిబాబు, గ్రామ పెద్దలు బానోత్ చిన్న, అంగన్వాడీ టీచర్స్ లలిత, స్రవంతి, సునీత, శారదా, సుజాత, ఆశవర్కలు
సరోజ, సుజాత, పంచాయితీ సిబ్బంది మూడు రమేష్,
వార్డు నెంబర్ లకావత్ సేవ, గోలి, క్రిష్ణవేణి, వాంకుడోత్ ద్వాళి, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: